News March 5, 2025

లక్షెట్టిపేట: గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

image

లక్షెట్టిపేట పట్టణం ముల్కల్లగూడెంనకు చెందిన ముల్కల్ల సత్యనారాయణ(44) ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడని ఎస్సై సతీష్ తెలిపారు. మంగళవారం ఉదయం సత్యనారాయణ గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడన్నారు. భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సత్యనారాయణ కాగజనగర్ ఎస్సీ వసతి గృహంలో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడని SI తెలిపారు.

Similar News

News November 20, 2025

మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

image

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.

News November 20, 2025

HYD: ఓయూలో “రిక్రూట్‌మెంట్ డ్రైవ్”

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్ (HCDC) ఆధ్వర్యంలో సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ కోసం కాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను CFRD భవనంలోని e-క్లాస్‌రూమ్ క్యాంపస్‌లో నిర్వహించారు. OUకి చెందిన ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) ప్రత్యేకతల విద్యార్థులకు మాత్రమే నిర్వహించారు. మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

News November 20, 2025

చలికాలం స్నానం చేయడం లేదా?

image

చలి విపరీతంగా పెరగడంతో చాలామంది స్నానం చేసేందుకు ఇష్టపడరు. ఎంత వేడినీటితో షవర్ చేసినా తర్వాత చలివేస్తుందంటూ స్నానానికి దూరంగా ఉంటున్నారు. కొందరైతే రోజుల తరబడి స్నానం చేయడంలేదు. అయితే ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు. స్నానం చేయకపోతే శరీరంపై చెమట పేరుకుపోయి అలర్జీలకు దారి తీస్తుందట. అలాగే చర్మం నుంచి దుర్వాసన వచ్చి ఇతరుల దృష్టిలో చులకన అవుతారు. నిత్యం తప్పనిసరిగా స్నానం చేయాలి.