News March 5, 2025

లక్షెట్టిపేట: గోదావరిలో మునిగి వ్యక్తి మృతి

image

లక్షెట్టిపేట పట్టణం ముల్కల్లగూడెంనకు చెందిన ముల్కల్ల సత్యనారాయణ(44) ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడని ఎస్సై సతీష్ తెలిపారు. మంగళవారం ఉదయం సత్యనారాయణ గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడన్నారు. భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా సత్యనారాయణ కాగజనగర్ ఎస్సీ వసతి గృహంలో వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడని SI తెలిపారు.

Similar News

News November 28, 2025

గుంటూరులో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మొత్తం 15 వినతులు స్వీకరించి, వ్యక్తిగత, సర్వీసు, బదిలీ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం పోలీస్ శాఖకు ప్రాధాన్యం అని, భయపడకుండా సమస్యలను నేరుగా తెలియజేయాలని ఆయన సూచించారు.

News November 28, 2025

పెద్దపల్లిలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడలు

image

పెద్దపల్లి కలెక్టరేట్ పరేడ్‌గ్రౌండ్‌లో దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎఫ్ ఆర్ ఓ స్వర్ణలత, డీడబ్ల్యూఓ ఇంచార్జ్ కవిత, రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ తదితర అధికారులు ప్రారంభించారు. చెస్, క్యారమ్స్, జావెలిన్, రన్నింగ్, షాట్‌పుట్ విభాగాల్లో 300 మంది వికలాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డబ్ల్యూసీడీ & ఎస్సీ శాఖ సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

News November 28, 2025

సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి: ఏలూరు కలెక్టర్

image

సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు మండలంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు.