News February 23, 2025

లక్షెట్టిపేట: దరఖాస్తుల స్వీకరణ

image

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మహాత్మా సంతోష్ తెలిపారు. ఎస్ టిఏ 4 సంవత్సరాల టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా నేషనల్ కామన్ ఎంట్రస్స్ టెస్ట్ 2025-2026ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీలోపు వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 8, 2025

నెల్లూరు: విష జ్వరాలపై కలెక్టర్ అత్యవసర సమావేశం

image

జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల అత్యవసర సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ, GGH వైద్యులతో నిర్వహించారు. బుచ్చి, రాపూరు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించనప్పటికీ లోపల మాత్రం దీనిపై పునరాలోచనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చినట్లు తెలిసింది.

News December 8, 2025

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్‌లో కూరగాయలు

image

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.

News December 8, 2025

పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

image

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.