News March 19, 2025
లక్షెట్టిపేట: ‘వసంత అరెస్ట్.. రిమాండ్కు తరలింపు’

లక్షెట్టిపేట పట్టణంలో కొత్తశ్యామల మెడలో బంగారు గొలుసును దొంగిలించిన నిందితురాలు సముద్రాల వసంతను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపామని సీఐ అల్లం నరేందర్, ఎస్సై సతీష్ తెలిపారు.16న శ్యామల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వసంత ప్లాన్ ప్రకారం శ్యామల మెడలోని సుమారు 3 తులాల పుస్తెలతాడును దొంగలించి పారిపోయిందన్నారు. శ్యామల ఫిర్యాదు మేరకు వసంతను అరెస్టు చేసి రిమాండ్కు పంపామని వారు తెలిపారు.
Similar News
News November 16, 2025
సంగారెడ్డి: లోక్ అదాలత్లో 58.42 లక్షల రికవరీ

సంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్ అదాలతో సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన 58.42 లక్షలు బాధితులకు అందించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొత్తం 1,134 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని పేర్కొన్నారు.
News November 16, 2025
కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
News November 16, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని CM రేవంత్ను R.కృష్ణయ్య కోరారు. నేడు రాష్ట్రంలో BC న్యాయసాధన దీక్షలు చేయనున్నారు.
*BRS కార్యకర్తలపై తాము దాడి చేశామని KTR చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జూబ్లీహిల్స్ MLAగా ఎన్నికైన నవీన్ యాదవ్ తెలిపారు.
*సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ACB మరోసారి దాడులు చేసింది. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


