News February 5, 2025
లక్షెట్టిపేట: ‘సుస్థిర ఆస్తుల కల్పన EGSలోనూ సాధ్యం’

సుస్థిర ఆస్తుల కల్పన MNREGSలో సాధ్యమవుతుందని DRDO కిషన్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపూర్, పోతపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, ఇతర పనులను పరిశీలించారు. రైతులకు పశువుల కొట్టాలు, అజోల గడ్డి పెంపకం, నాడేపు కంపోస్ట్, చెక్ డ్యామ్స్, కిచెన్ షెడ్, పాఠశాల ప్రహరీల వంటి సుస్థిర ఆస్తులు ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్నామన్నారు.
Similar News
News February 8, 2026
వనపర్తి: ప్రశాంతంగా 7వ రోజు ఇంటర్ ప్రాక్టికల్స్

వనపర్తి జిల్లాలోని 15 కేంద్రాలలో 7వ రోజు ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా ముగిశాయని DIEO అంజయ్య తెలిపారు. ఉదయం 486 మంది, మధ్యాహ్నం 581 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం మీద ఆదివారం జరిగిన పరీక్షలకు 36 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా అధికారులు పలు పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు.
News February 8, 2026
జమ్మలమడుగు: కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

జమ్మలమడుగు మండలంలోని పెద్దండ్లూరు వద్ద పెన్నా నదీ తీరాన భాను కొండల మధ్య సుమారు 5 వేల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రం వెలిసినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో అలనాడు దేవకన్యకలు నిత్యం స్నానమాచరించి అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పూజారులు చెబుతున్నారు. కన్యతీర్థం, తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ఒకే ఆచారం, పోలికలు ఉండటం మరో విశేషం.
News February 8, 2026
NRPT: ప్రచార కార్యక్రమాలపై నిషేధం: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సోమవారం సాయంత్రం 5 గంటల లోపు ముగించాలని రాజకీయ పార్టీల నేతలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రెండు రోజుల పాటు అనగా ఈనెల 11న పోలింగ్ ముగిసే వరకు వైన్స్, కల్లు దుకాణాలు మూసి వేయాలని చెప్పారు.


