News February 21, 2025
లక్ష్మణచందా: విద్యార్థులకు అవగాహన కల్పించిన డీఈవో

లక్ష్మణచందా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారి పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు.
Similar News
News December 24, 2025
గన్నవరం: వల్లభనేని వంశీ మళ్లీ సైలెంట్.. కేసుల భయమేనా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెల రోజుల నుంచి యాక్టివ్గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఫంక్షన్లు, బాధిత కుటుంబాల వద్దకు వెళ్తూ ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో వంశీ అనుచరులు దాడి చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇటీవల వంశీపై మరో కేసు నమోదైంది. దీంతో వారం రోజుల నుంచి వంశీ మళ్లీ సైలెంట్ అయ్యారు. ఆ కేసులో బెయిల్ తీసుకున్న తర్వాత మళ్లీ ఆయన పర్యటించే అవకాశం ఉంది.
News December 24, 2025
BNGR: ఆన్లైన్ పరిచయంతో న్యూడ్ కాల్స్.. కట్ చేస్తే

ఆన్లైన్ పరిచయం ఓ యువకుడిని నిలువునా ముంచింది. భువనగిరికి చెందిన యువకుడికి రాజమండ్రికి చెందిన మరో యువకుడితో సోషల్ మీడియాలో పరిచయమైంది. చాటింగ్తో పరిచయం పెంచుకుని న్యూడ్ కాల్స్ చేసుకున్నారు. ఆపై రాజమండ్రి వ్యక్తి రూ.2 లక్షలు చేబదులు తీసుకున్నాడు. బాధితుడు తన డబ్బు తిరిగి అడగడంతో.. పాత ఫొటోలు, చాటింగ్ వివరాలతో కూడిన ఫ్లెక్సీని ఇంటి ముందే కడతానని బెదిరింపులకు దిగాడు.
News December 24, 2025
భూపాలపల్లి: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

భూపాలపల్లి జిల్లాలో యాసంగి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ ముగుస్తున్నా రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాసంగిలో 1.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. శాటిలైట్ సర్వే ద్వారా సాగులో ఉన్న భూములను గుర్తించి పంటలు పండిస్తున్న వారికి మాత్రమే భరోసా ఇస్తామని మంత్రి ఇటీవల ప్రకటించారు.


