News February 20, 2025
లక్ష్మణచాంద: భార్య మందలించిందని భర్త సూసైడ్

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన లక్ష్మణచాందలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. సీతక్కకి పవార్ రమేశ్ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. గత 15వ తేదీన బాగా మద్యం తాగి ఇంటికి రాగా అతని భార్య జ్యోతి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుమందు తాగారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించగా పరిస్థితి విషమించి మరణించారు.
Similar News
News November 21, 2025
నేడు JNTUకి సీఎం రేవంత్ రెడ్డి

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు నేడు ఉ.10 గం.కు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరై లోగోను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా యూనివర్సిటీ నిర్వహిస్తున్న అలుమ్నీ మీటింగ్ కూడా ప్రారంభించి విద్యార్థులతో సీఎం మాట్లాడతారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News November 21, 2025
వరంగల్: విద్యార్థుల వికాసానికి ‘చెలిమి’

ఉద్యోగుల భావోద్వేగ స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఆలోచనలను పెంపొందించేందుకు ప్రభుత్వం చెలిమి సోషియో-ఎమోషనల్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 92 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన నోడల్ టీచర్లు హైదరాబాద్లో మూడు విడతలుగా శిక్షణ పొందుతున్నారు. అనంతరం 6వ తరగతి పై విద్యార్థులకు చెలిమి కరికులం అమలు చేయనున్నారు. భావోద్వేగాలు, స్వీయ నియంత్రణ, పాజిటివ్ ఆలోచన ప్రధాన లక్ష్యం.
News November 21, 2025
HYD: దొంగ నల్లా కనెక్షన్పై ఫిర్యాదు చేయండి

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.


