News April 4, 2025
లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే టాప్

ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్మణచాంద మండలం నిర్మల్ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎంపీడీఓ రాధారాథోడ్ గురువారం తెలిపారు. 99 శాతం ఇంటి పన్ను వసూలు చేసినందుకు ఎంపీఓ ఆమీర్ ఖాన్, ఆయ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆమె అభినందించారు. ఇందుకు సహకరించిన లక్ష్మణచాంద మండల ప్రజలకు, వాణిజ్య సముదాయాలకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News July 5, 2025
నాగర్కర్నూల్లో రేబిస్ వ్యాధి టీకాలు

ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా పశువైద్యశాఖ ఆధ్వర్యంలో రేబిస్ వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నాగర్కర్నూల్ పశువైద్యశాలలో ఈ టీకాలు వేయనున్నట్లు అని జిల్లా పశువైద్యశాఖ అధికారి జ్ఞానశేఖర్ తెలిపారు. శునకాల ప్రేమికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.
News July 5, 2025
దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
News July 5, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ రేపు ఉపమాక గరుడాద్రి పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ
➤ జలాశయాల్లో చేపలవేటకు నిషేధం
➤ అభివృద్ధి సూచికపై శిక్షణలో పాల్గొన్న ఎంపీడీవోలు
➤ పోలవరం ప్రాజెక్టు డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సుందరపు
➤ స్మార్ట్ మీటర్లను పగలగొట్టి నిరసన తెలిపిన సీపీఐ
➤ మాడుగుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
➤ గురుజాపాలెంలో ఆటిజం శిక్షణా కేంద్రం ఏర్పాటు