News July 26, 2024
లక్ష్మీ పంప్ హౌస్ కరెంట్ బిల్లు బకాయిలు రూ.492కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌస్ విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.వందల కోట్ల మేర పేరుకుపోయాయి. 2019లో జూన్ 21న లక్ష్మీ పంప్ హౌస్లో ఎత్తిపోతలు ప్రారంభించగా.. అప్పటినుంచి ఇప్పటివరకు రూ.492 కోట్లకు పైగా బిల్లు బకాయిలు ఉన్నట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు. లక్ష్మీ పంప్ హౌస్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు 163 టీఎంసీల నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోశారు.
Similar News
News November 17, 2025
KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
News November 17, 2025
KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
News November 17, 2025
మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.


