News December 13, 2024

లక్ష్యసాధనకు నిర్విరామంగా కృషి చేయాలి: ముజమ్మిల్ ఖాన్ 

image

నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు విద్యార్థులు నిర్విరామంగా కృషి చేయాలని కమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం నయా బజార్ జూనియర్ కళాశాల కాంప్లెక్స్ లో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితులకు అందించిన వరద సహాయక కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న ఖమ్మంను విడతల వారీగా బాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

Similar News

News January 18, 2025

ఖమ్మంలో విషాదం.. చెరువులో దంపతుల మృతదేహాలు లభ్యం

image

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం నెలకొంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన కృష్ణ(60), సీత(55) దంపతులు అదే గ్రామంలోని రావి చెరువులో శవమై తేలడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దంపతులు ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 18, 2025

KMM: శతాబ్ది బ్రిడ్జిపై.. నిలిచిన రాకపోకలు

image

నిజాం హయాంలో ఖమ్మంలో నిర్మించిన మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వరదలకు బ్రిడ్జి ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు నిలిపివేశారు. అటు రూ.187కోట్లతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పూర్తికి మరో ఏడాది పడుతుందంటున్నారు. దీంతో పక్కనే కాజ్‌వేపై రాకపోకలు పునరుద్ధరించడంతో ట్రాఫిక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

News January 18, 2025

ప్రతి గామానికి ఒక రెవెన్యూ అధికారి: మంత్రి పొంగులేటి

image

పంచాయతీ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. HYD సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, మరో వెయ్యి మందిని నియమించేలా అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.