News February 5, 2025
లక్ష డప్పులతో కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కి అమరావతి వెళ్లండి: డా.రవి

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపి అమలుపరిచిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయోత్సవ సంబరాలలో భాగంగా ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు.
Similar News
News January 14, 2026
పతంగ్కు పక్కా ప్లాన్.. చెరువు వద్ల కుర్రాళ్ల చిల్ అవుట్!

డాబాల మీద డీజే గోల, పతంగుల కోసం కొట్లాటలకు ఈ తరం కుర్రాళ్లు గుడ్ బై చెప్పేస్తున్నారు. నెక్లెస్ రోడ్, గండిపేట లాంటి చెరువు గట్లనే తమ పతంగ్ అడ్డాగా మార్చుకుంటున్నారు. తెల్లవారుజామునే చాయ్ థర్మోస్, ఫోల్డబుల్ కైట్స్, మ్యూజిక్ కోసం చిన్న బ్లూటూత్ స్పీకర్తో అక్కడ వాలిపోతున్నారు. రొటీన్ రచ్చకు దూరంగా, ప్రశాంతమైన గాలిలో గాలిపటాలు ఎగరేస్తూ సరికొత్త ‘యాంటీ నాయిస్’ కల్చర్కు తెరలేపుతున్నారు. మీకూ నచ్చిందా?
News January 14, 2026
HYD: భూగర్భజలాలు పాతాళానికి

భారీ వర్షాలు కురిసినా బల్దియాలోని భూగర్భజలాలు పడిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే నీటిమట్టం 2-3 అడుగుల దిగువకు జారిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. GHMC పరిధిలోని 46 మండలాల్లో 13 మండలాలు రెడ్జోన్లోకి వెళ్లాయి. కాంక్రీటీకరణతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం ప్రధాన కారణం. బోర్లు అడుగంటడంతో వేసవిలో నగర, శివారువాసులకు నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకుడు గుంతల ఆవశ్యకత గుర్తుచేస్తున్నాయి.
News January 14, 2026
మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.


