News July 13, 2024

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన పోచారం

image

కోటగిరి మండల కేంద్రంలో లబ్ధిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. 91 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 22 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, పోతంగల్ ఎమ్మార్వో మల్లయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు శంకర్, లక్ష్మణ్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 19, 2025

అంకిత భావంతో కృషి చేయాలి: NZB కలెక్టర్

image

10వ తరగతి ఫలితాలు మరింత మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి MEOలు, కాంప్లెక్స్ HMలకు సూచించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడుల స్థితిగతులు, బోధన తీరు, సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ MEOలు, కాంప్లెక్స్HMలతో చర్చించారు. వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

News November 19, 2025

NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

image

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.

News November 19, 2025

నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.