News October 7, 2024

లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి

image

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజుజూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శ్రీ లలితా దేవిగా రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని లలిత సహస్రనామాలు పటిస్తున్నారు. నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Similar News

News November 2, 2025

వికారాబాద్: కుటుంబ కలహాలే హత్యలకు కారణం..!

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో <<18174716>>ముగ్గురి హత్యలకు కారణం<<>> కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు.. భార్య అలివేలు, ఆమె సోదరి హన్మమ్మ, చిన్న కూతురు శ్రావణి నిద్రిస్తుండగా ఏపూరి యాదయ్య(38) ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు వారిని కత్తితో నరికి చంపాడు. పెద్ద కూతురు అపర్ణపై కూడా దాడి చేయగా తప్పించుకుంది. అనంతరం ఆయన సూసైడ్ చేసుకున్నాడు. DSP శ్రీనివాస్ ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.

News November 2, 2025

HYD: KCR తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు: కిషన్ రెడ్డి

image

‘బంగారు తెలంగాణ’ పేరిట KCR తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో శనివారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 83 కోట్ల మందికి ఉచిత బియ్యం, ఉజ్వల పథకం, మహిళలకు రుణాలు అందిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలిందన్నారు.

News November 2, 2025

BIG BREAKING: వికారాబాద్ జిల్లాలో ముగ్గురి MURDER, ఒకరిపై హత్యాయత్నం

image

ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి తాను సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య అతడి భార్య, కుమార్తె, వదినను కత్తితో పొడిచి చంపి, మరో కుమార్తెను చంపేందుకు యత్నించాడు. అనంతరం తాను సూసైడ్ చేసుకున్నాడు. పరిగి DSP శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.