News March 25, 2024
లవ్ మ్యారేజ్.. మరో ఎఫైర్ పెట్టుకొని భార్యకు వేధింపులు

భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై ఉండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉండికి చెందిన సూరిబాబు, జ్యోతి 2011లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా చెడు వ్యసనాలకు బానిసైన సూరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని భార్య ఆదివారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 5, 2025
ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News December 5, 2025
నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.
News December 5, 2025
నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.


