News July 13, 2024
లష్కర్గూడ: సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి పొన్నం

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లష్కర్గూడలో ఆదివారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే రంగారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. గీత కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అందులో భాగంగానే రేపు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నారు.
Similar News
News October 19, 2025
జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు

జూబ్లీహిల్స్ బైపోల్కు ముందు MLA పార్టీ ఫిరాయింపుల చర్చ తెరమీదకు వచ్చింది. BRS నుంచి గెలిచి పార్టీ మారిన MLA దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్స్ లిస్టులో ఉంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుండగానే విడుదలైన ఈ జాబితా రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆయన ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
News October 19, 2025
జూబ్లీ బైపోల్: ఇప్పటికి 127.. ఉన్నది ఒక్కరోజే!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు జోరందుకున్నాయి. అధికారులు ఊహించని విధంగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 127 మంది పోటీచేస్తామంటూ ముందుకువచ్చారు. నామినేషన్లు వేసేందుకు తుది గడువు 3 రోజుల (21వ తేదీ వరకు) సమయమున్నా.. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. 19 ఆదివారం, 20న దీపావళి కావడంతో మంగళవారం ఆఖరి రోజు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి నామినేషన్ వేస్తామని పలువురు ప్రకటించడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
News October 19, 2025
జూబ్లీ బరిలో ఎవ్వరూ తగ్గట్లేదుగా

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. వచ్చేనెల 11న జరిగే ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారం జోరుపెంచాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ 40 మందిని ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను నియమించగా గులాబీ దళం నుంచి 60 మందిని నియమించింది. ఇరు పార్టీలు కీలకనేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాయి. రాష్ట్ర రాజకీయాలు గ్రౌండ్ లెవల్కు వచ్చాయనే చర్చ నడుస్తోంది.