News March 20, 2024
లారీ-గోడకు మధ్య ఇరుక్కొని మహిళల మృతి

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం లలిత రైస్ ఇండస్ట్రీలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ వెనక్కి తీస్తుండగా క్యాబిన్కు-గోడకు మధ్య చిక్కుకొని కామేశ్వరి(60), నాగరత్నం(65) మృత్యువాత పడ్డారు. వర్షం వస్తోందని గోడ పక్కన నిలుచున్న వీరిని లారీ ఢీ కొట్టింది. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 3, 2025
రాజమండ్రిలో పార్మసిస్ట్ కేసు దర్యాప్తు

లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అపార అపస్మారక స్థితిలో ఉన్న అంజలి కేసు విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోందని డీఎస్పి భవ్య కిషోర్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితుడుని దీపక్ని అరెస్ట్ చేశామన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా చేసుకుని రాజకీయ లబ్ధికి కొందరు కేసును పక్కదారి పట్టించడం తగదన్నారు.
News April 2, 2025
రాజమండ్రి: ఆందోళనకరంగా నాగాంజలి ఆరోగ్య పరిస్థితి

వేధింపులు తాళలేక ఆత్మయత్నానికి పాల్పడి బొల్లినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అత్యవసర విభాగానికి తరలించినట్లు డా. పీవీవీ సత్యనారాయణ, డా. అనిల్ కుమార్, డా. సీ.హెచ్. సాయి నీలిమ ప్రభుత్వ వైద్య బృందం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రక్తపోటు, పల్స్, శ్వాసక్రియ, నాడీ వ్యవస్థ స్పందన తక్కువగా ఉందన్నారు.
News April 2, 2025
రాజమండ్రి: కోర్టు సంచలన తీర్పు

మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించినట్లు చాగల్లు ఎస్సై కె. నరేంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..చాగల్లు మండలంలో 2020లో తన మైనర్ కుమార్తెపై ఆమె తండ్రి అత్యాచారం చేయగా గర్భం దాల్చింది. అప్పటి డీఎస్పీ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. కేసులో న్యాయస్థానం తండ్రికి యావజ్జీవ శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.