News March 20, 2024

లారీ-గోడకు మధ్య ఇరుక్కొని మహిళల మృతి

image

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం లలిత రైస్ ఇండస్ట్రీలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. లారీ వెనక్కి తీస్తుండగా క్యాబిన్‌కు-గోడకు మధ్య చిక్కుకొని కామేశ్వరి(60), నాగరత్నం(65) మృత్యువాత పడ్డారు. వర్షం వస్తోందని గోడ పక్కన నిలుచున్న వీరిని లారీ ఢీ కొట్టింది. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 15, 2025

రాజమండ్రి: రేపటి నుంచి ఉర్దూ స్వర్ణోత్సవ వారోత్సవాలు

image

ఉర్దూ అకాడమీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 16 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఉర్దూ అకాడమీ ప్రతినిధి నస్రీన్ ఫాతిమాతో కలిసి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందరూ వీటిని విజయవంతం చేయాలని కోరారు.

News December 15, 2025

తూ.గో: పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల నిఘా

image

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్థుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.

News December 15, 2025

తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.