News December 24, 2024
లింక్ వస్తుంది.. మోసం మొదలవుతుంది: కర్నూలు ఎస్పీ

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు. పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనల పట్ల జాగ్రత వహించాలని పిలుపునిచ్చారు. ‘లైక్, షేర్ చేస్తే .. రివ్యూలు ఇస్తే డబ్బులు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తారు. ఆలోచించండి, మోసపోకండి’ అని ఎస్పీ హెచ్చరించారు. మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News March 14, 2026
కర్నూలులో ఈనెల 16న గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 16న (సోమవారం) కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టంనిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. అదేరోజు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులు సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 14, 2026
కర్నూలులో కట్టుదిట్టమైన బందోబస్తు: ఎస్పీ

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు, విధుల్లో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులను కేంద్రాల వద్దకు అనుమతించరని పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 14, 2026
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ప్రతీ సోమవారం రెవెన్యూ క్లినిక్లు నిర్వహించి మ్యుటేషన్లు, అసైన్మెంట్, డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,523 దరఖాస్తుల్లో 724 పరిష్కరించగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.


