News October 8, 2024

లింగంపేటలో ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి

image

లింగంపేట మండలంలోని బోనాలు తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన రిషికేష్ (6) మంగళవారం ఇంటి సమీపంలో ఉన్న ఆగి ఉన్న ట్రాక్టర్ పై ఎక్కి ఆడుకుంటూ గేర్లను డౌన్ చేశాడు. దీంతో ట్రాక్టర్ గుంతలో బోల్తా పడి బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News October 9, 2024

NZB: ప్రజలకు సీపీ ముఖ్య సూచనలు

image

దసరా పండుగ సందర్భంగా తమ ఊర్లకు వెళ్లే వారికి NZB సీపీ కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంభందించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. తమ తమ గ్రామాలకు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో సమాచారం అందించాలని పేర్కొన్నారు.

News October 8, 2024

HYDలో రేపు MLA KVR ప్రెస్ మీట్

image

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలియజేశారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.

News October 8, 2024

చందూర్ పెద్ద చెరువులో పడి వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. కాగా ప్రమాదవశాత్తు మృతి చెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.