News January 24, 2025
లింగంపేట్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లింగంపేట్లో శుక్రవారం చోటు చేసుకుంది. SI సుధాకర్ వివరాలిలా.. లింగంపేట్కు చెందిన కాశిరాం(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చూపించినా జబ్బు నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 21, 2025
BREAKING: భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏడీసీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడే ఎస్పీగా ప్రమోట్ అవ్వగా, నేడు జరిగిన బదిలీల్లో భూపాలపల్లి ఎస్పీగా నియామకమయ్యారు. కాగా 2023 వరదల సహాయక చర్యల్లో సిరిశెట్టి సంకీర్త్కు మంచి గుర్తింపు వచ్చింది.
News November 21, 2025
భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏసీడీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడే ఎస్పీగా ప్రమోట్ అవ్వగా, నేడు జరిగిన బదిలీల్లో భూపాలపల్లి ఎస్పీగా నియామకమయ్యారు. కాగా 2023 వరదల సహాయక చర్యల్లో సిరిశెట్టి సంకీర్త్ మంచి గుర్తింపు వచ్చింది.
News November 21, 2025
టాటా డిజిటల్లో భారీగా లేఆఫ్లు

టాటా గ్రూప్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్లోనూ ఎంప్లాయీస్ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్ పునర్వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.


