News January 24, 2025
లింగంపేట్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లింగంపేట్లో శుక్రవారం చోటు చేసుకుంది. SI సుధాకర్ వివరాలిలా.. లింగంపేట్కు చెందిన కాశిరాం(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చూపించినా జబ్బు నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 24, 2025
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ బి.రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 26 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.
News November 24, 2025
నిర్మల్: డిసెంబర్ 5లోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే టైలరింగ్, డ్రాయింగ్ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 5 అని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) భోజన్న తెలిపారు. ఈ పరీక్షలు జనవరి, ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కు రూ.100, హయ్యర్ గ్రేడ్కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీకి రూ.100, హయ్యర్ గ్రేడ్కు రూ.200 చొప్పున చెల్లించాలన్నారు.
News November 24, 2025
నల్గొండ: మహిళా ఓట్ల కోసం వ్యూహం..!

అధికార కాంగ్రెస్ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ఫోకస్ చేసింది. చాలా వేగంగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోంది. NLG జిల్లాలో 29,754 గ్రూపుల్లో, 2,97,054 సభ్యులు, SRPT జిల్లాలో 17,611 గ్రూపుల్లో 1,91,576 సభ్యులు, BNG జిల్లాలో 39,871 గ్రూపులకు 1,59,482 సభ్యులకు చీరలు పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటుగా రేషన్ కార్డున్న వారికి సైతం అందించి ఓట్లను సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు.


