News February 7, 2025
లింగంపేట్: దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

లింగంపేట్ మండలం కోమట్ పల్లి గ్రామంలో శుక్రవారం కొందరు అపరిచిత వ్యక్తులను స్థానికులు పోలీస్లకు అప్పగించారు. గ్రామంలో జాతకాలు చెప్తామని, మీ ఇంట్లో అశుభం జరుగుతుందని గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసినట్లు స్థానికులు తెలిపారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News March 28, 2025
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నద్ధం: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను కలెక్టర్ ఎం.మనూ చౌదరి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
News March 28, 2025
HYD: వామ్మో.. ఏంటీ పరిస్థితి..!

గ్రేటర్ HYDలో అనేక ప్రాంతాల్లో దోమల బెడద ఉన్నట్లు GHMC దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఖైరతాబాద్కు చెందిన ఓ డాక్టర్ అన్సారి ట్వీట్ గ్రేటర్ పరిస్థితికి అద్దం పడుతోంది. దోమలను చంపేసి తన ఇంటి ఫ్లోర్పై ఏకంగా కుప్పలు తెప్పలుగా ఉంచిన ఫోటోను అధికారులకు చూపుతూ, ఏంటి ఈ పరిస్థితి..? ఇలా అయితే విష జ్వరాలు సోకే అవకాశం ఉందన్నారు. మరి మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది. GHMC చర్యలపై మీ కామెంట్.
News March 28, 2025
Stock Markets: ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ మినహా…

స్టాక్మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. నిఫ్టీ 23,519 (-72), సెన్సెక్స్ 77,414 (-191) వద్ద ముగిశాయి. FMCG, ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. మీడియా, ఐటీ, రియాల్టి, ఆటో, మెటల్, ఫార్మా, కమోడిటీస్, పీఎస్యూ బ్యాంకు, హెల్త్కేర్, ఎనర్జీ షేర్లు ఎరుపెక్కాయి. టాటా కన్జూమర్, కొటక్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్, ONGC, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్. విప్రో, ఇండస్ఇండ్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా టాప్ లూజర్స్.