News January 24, 2025
లింగంపేట: ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య

ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు(31) అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వీపర్గా పని చేస్తున్నారు. అతను మద్యం తాగడానికి తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో తల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టివేసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News September 18, 2025
VJA: దుర్గా మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయ వివరాలు

ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2,17,98,528 నగదు, 235 గ్రా. బంగారం, 1.39 కి.గ్రా. వెండి హుండీ కానుకలుగా వచ్చాయని EO శీనా నాయక్ తెలిపారు. 321 US డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 UAE దిర్హమ్స్, 25 సౌదీ రియల్స్, 200 ఒమన్ బైసా కరెన్సీతో పాటు 7 ఇతర దేశాల విదేశీ కరెన్సీ ఇంద్రకీలాద్రిపై ఉన్న 48 హుండీలలో కానుకలుగా వచ్చాయన్నారు.
News September 18, 2025
చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్

AP: ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 18, 2025
వరంగల్: వామ్మో.. ఇంతమంది ఉన్నా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఇద్దరు IASలు, ముగ్గురు IPSలతో జిల్లా మొత్తం నడిచేది. చిన్న జిల్లాలు అయ్యాక ఏకంగా ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలకు ఆరుగురు కలెక్టర్లతో పాటుగా మరో ముగ్గురు IASలు ఉండగా, 10 మంది IPSలు పని చేస్తున్నారు. పెద్ద జిల్లాగా ఉన్న సమయంలో ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ అధికారి మొత్తం జిల్లాను పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఇంతమంది సివిల్ సర్వెంట్లున్నా చెప్పుకోదగ్గ పనులేవి లేవని ప్రజలు అంటున్నారు.