News January 24, 2025
లింగంపేట: ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య

ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు(31) అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వీపర్గా పని చేస్తున్నారు. అతను మద్యం తాగడానికి తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో తల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టివేసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 30, 2025
మోత్కూర్ ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

మోత్కూర్ మండలం దత్తప్పగూడెంకి చెందిన విద్యుత్ హెల్పర్ ఓర్సు సురేష్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ కూలడంతో విద్యుత్ లైన్ సరిచేస్తుండగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. వెంటనే భువనగిరి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సురేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News October 30, 2025
బాహుబలి టికెట్ల పేరుతో మోసాలు.. జాగ్రత్త!!

కొత్త సినిమా టికెట్లు ఉన్నాయంటూ SMలో కొందరు మోసాలు చేస్తున్నారు. తాజాగా ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా ప్రీమియర్ టికెట్లు ఉన్నాయని, కావాలంటే మెసేజ్ చేయాలని ఓ వ్యక్తి(Heisenberg M) ట్వీట్ చేశాడు. ఇది నమ్మి డబ్బులు పంపి మోసపోయామని నెటిజన్లు చెబుతున్నారు. ఆ ఖిలాడి చెప్పిన 9391872952 నంబర్కు డబ్బులు పంపిన తర్వాత బ్లాక్ చేస్తున్నట్లు వాపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News October 30, 2025
గాయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో <<18117184>>తీవ్రంగా<<>> గాయపడటంపై టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి సమయంలో అభిమానులు మద్దతుగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆసీస్తో చివరి వన్డేలో క్యాచ్ పడుతూ శ్రేయస్ గాయపడ్డారు. దీంతో అతడికి ఐసీయూలో చికిత్స అందించారు.


