News February 2, 2025

లింగంపేట: బెల్ట్ షాపులు నిర్వహించవద్దని తీర్మానం

image

లింగంపేట మండలం పరిమళ్ళలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహించవద్దని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపుల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే లక్ష రూపాయలు జరిమానా విధించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బెల్ట్ షాపులను ఎవరు ప్రోత్సహించినా అమ్మినా సహించేది లేదని స్పష్టం చేశారు.

Similar News

News November 21, 2025

ట్రై సిటీలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

image

ట్రై సిటీ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News November 21, 2025

ఇంటలెక్చువల్ టెర్రరిస్టులు మరింత ప్రమాదం: ఢిల్లీ పోలీసులు

image

టెర్రరిస్టుల కంటే వారిని నడిపిస్తున్న ఇంటలెక్చువల్స్ మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ASG రాజు చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ట్రెండ్‌గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10 రెడ్‌ఫోర్ట్ పేలుళ్లే ఉదాహరణలని గుర్తుచేశారు. విచారణ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ నిందితులు బెయిల్ కోరుతున్నారన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ASG వాదనలు వినిపించారు.

News November 21, 2025

HNK: రేపు సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి రాక

image

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే సమావేశానికి హాజరవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు హనుమకొండ కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం అమలుపై అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం జిల్లాకు చెందిన రెవెన్యూ, మునిసిపల్ మొదలైన విభాగాల RTI చట్టం కింద దాఖలు చేయబడిన అప్పీళ్లు / ఫిర్యాదులపై విచారణలు నిర్వహిస్తారు.