News February 13, 2025

లింగంపేట: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన లింగపేటలో చోటు చేసుకుంది. ఎస్ఐ అనిల్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కుర్ర వెంకటి (25) 3 నెలల క్రితం ఆరేపల్లిలో చెరుకు కొట్టడానికి వెళ్లాడు. కాగా బుధవారం చెరకు కొట్టి గుడిసెలోనికి వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తాకి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News December 6, 2025

MBNR: ప్రభుత్వ ఉద్యోగులు.. ALERT!

image

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్‌లలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 8న తమ ఫారం-14 తీసుకొని నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తమ ఓటును వేయొచ్చని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
#SHARE IT.

News December 6, 2025

‘RO-KO’ని దాటేసిన వైభవ్ సూర్యవంశీ

image

వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025లో మోస్ట్ సెర్చ్‌డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ సాధించారు. ఐపీఎల్‌తో ఈ యంగ్‌స్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. రెండో స్థానంలో ప్రియాన్ష్ ఆర్య, మూడో స్థానంలో అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నాలుగో స్థానం, జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచారు. IPL 2025, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బజ్ ఉన్నా రోహిత్, కోహ్లీ ఈ లిస్టులో పేర్లు సాధించలేకపోయారు.

News December 6, 2025

NZB: జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం నగరంలోని రాజారాం స్టేడియంలో జరిగాయి. ఈ ఎంపికలో రాష్ట్ర స్థాయికి 70 మీటర్ల పురుషుల విభాగంలో N.రవీందర్ (గోల్డ్), N.రుత్విక్ (సిల్వర్), A.నవీన్ (బ్రాంజ్), ఇండియన్ రౌండ్‌లో బాయ్స్ విభాగంలో M.శ్రీధర్ (గోల్డ్), N.రాజేందర్ (సిల్వర్), SK రెహన్ (బ్రాంజ్) ఎంపికయ్యారని అర్చరీ కోచ్ రవీందర్ తెలిపారు.