News January 30, 2025

లింగపాలెం: రక్తపు మడుగులో మహిళ మృతి

image

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జక్కంపూడి. నాగమణి(35) తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 22, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు NRCలు: మంత్రి

image

నేషనల్ హెల్త్ మిషన్ కింద పార్వతీపురం మన్యం జిల్లాలో 5 NRCలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులకు సేవలు అందించేందుకు వీలుగా న్యూట్రిషన్ రిహబిలిటేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. 5 పడకలతో సాలూరు, పాలకొండ, భద్రగిరి, కురుపాం, చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.

News November 22, 2025

పాపాల నుంచి విముక్తి కోసం..

image

తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాప భయాపహమ్ ||సమస్త లోకాలకు ఆధారభూతుడైన, ఏకైక ప్రభువైన విష్ణుమూర్తి వేయి నామాలను తప్పక ఆలకించాలని భీష్మాచార్యుల వారు ఉద్బోధించారు. ఈ పవిత్ర నామాలను శ్రద్ధతో వినడం వలన పాప కర్మలు, జన్మ,మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. శాశ్వత శాంతిని, సకల శుభాలను పొందడానికి విష్ణు సహస్ర నామ పారాయణ సులభమైన మార్గమంటారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 22, 2025

మావోయిస్టు దామోదర్ పేరుతో ఫోన్ కాల్స్ కలకలం!

image

మావోయిస్టు అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావ్@ దామోదర్ పేరిట కొందరు వ్యాపారులకు ఫోన్ చేస్తుండటం జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్ చేసి డబ్బులు అడగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయాన్ని జిల్లాలో అక్కడక్కడ స్థానికులు మాట్లాడుకోవడం గమనార్హం. దామోదర్ పేరుతో ఫోన్ ఎవరు చేశారు? దామోదర్ ఎక్కడున్నాడనే విషయంపై సందిగ్ధం నెలకొంది.