News January 30, 2025
లింగపాలెం: రక్తపు మడుగులో మహిళ మృతి

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జక్కంపూడి. నాగమణి(35) తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
నేడు కామారెడ్డిలో జాబ్ మేళా

నిరుద్యోగుల కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శుక్రవారం కలెక్టరేట్లోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమర్ తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 6300057052, 7671974009 నంబర్లను సంప్రదించాలన్నారు.
News November 21, 2025
KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా పర్యటన రద్దు

నేడు కరీంనగర్లో జరగాల్సిన మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన వాయిదా పడింది. హైదరాబాదులో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రోగ్రాం వాయిదా పడ్డట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. LMD వద్ద నిర్వహించనున్న చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారని, కొత్తపల్లి మండలంలో నిర్వహించే మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీనిని మరోరోజు నిర్వహించనున్నారు.
News November 21, 2025
KNR: TGNPDCL డిజిటల్ సేవలు..!

మెరుగైన సేవలకు TGNPDCL యాప్ తీసుకొచ్చింది. దీంతో న్యూకనెక్షన్, సెల్ఫ్ రీడింగ్, పేబిల్స్, బిల్స్ హిస్టరీ, లోడ్ ఛేంజ్, కంప్లైంట్ స్టేటస్ వంటి 20రకాల డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ చాట్బాట్ ద్వారా కూడా కరెంట్ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అప్లికేషన్ నమోదు నుంచి సర్వీస్ రిలీజ్ వరకు సేవలు పొందొచ్చు. ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ సేవలు ఆస్వాదించాలని అధికారులు కోరుతున్నారు.


