News January 30, 2025
లింగపాలెం: రక్తపు మడుగులో మహిళ మృతి

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జక్కంపూడి. నాగమణి(35) తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసింది: చైనా

తైవాన్పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక జోక్యానికి జపాన్ వెనుకాడబోదని ప్రధాని సనై తకాయిచి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ కామెంట్లతో జపాన్ రెడ్ లైన్ క్రాస్ చేసిందని చైనా మినిస్టర్ వాంగ్ యీ అన్నారు. జపాన్ సైనికవాదం పెరగకుండా నిరోధించాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా తకాయిచి కామెంట్లు ఉన్నాయంటూ UNకు రాసిన లెటర్లో చైనా పేర్కొంది.
News November 24, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓భద్రాద్రి: రేపు డివిజన్ల వారీగా ప్రజావాణి
✓భద్రాచలం ITDAలో రేపు గిరిజన దర్బార్
✓డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల
✓జూలూరుపాడు: రెజ్లింగ్ లో హారికకు గోల్డ్ మెడల్
✓చర్ల: కోరేగడ్డ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
✓అశ్వాపురం: దుప్పి మాంసం కేసులో నిందితులకు రిమాండ్
✓కొత్తగూడెం: పశువుల అక్రమ రవాణా గుర్తు రట్టు
✓పాల్వంచ, సుజాతనగర్లో ఇండియా హౌస్ బృందం పర్యటన
News November 24, 2025
మృణాల్తో ధనుష్ డేటింగ్?.. పోస్టులు వైరల్

ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. మృణాల్ నటించిన ‘దో దీవానే షెహర్ మే’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. దీనిపై ఆమె ఇన్స్టాలో పోస్టు చేయగా ‘చాలా బాగుంది’ అనే అర్థంలో ధనుష్ కామెంట్ చేశారు. దీనికి హీరోయిన్ లవ్ సింబల్తో రిప్లై ఇచ్చారు. ఈ స్క్రీన్ షాట్లను అభిమానులు వైరల్ చేస్తున్నారు. వారిమధ్య బంధం నిజమేనంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరగగా మృణాల్ ఖండించారు.


