News January 30, 2025
లింగపాలెం: రక్తపు మడుగులో మహిళ మృతి

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన జక్కంపూడి. నాగమణి(35) తన ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2026
ఎండు ద్రాక్షతో ఎన్నో లాభాలు

ఎండు ద్రాక్షను నేరుగా తినడం కంటే నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయంటున్నారు నిపుణులు. ఎండుద్రాక్షలను నానబెట్టినప్పుడు వాటిపై ఉండే పొర మెత్తబడి, లోపల ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయంటున్నారు. దీనివల్ల రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి, ఎముకల బలం పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.
News February 24, 2026
మా డోర్లు తెరిచే ఉంటాయి… సమస్యలు చెప్పండి: పొన్నం

TG: ప్రభుత్వంలో RTC విలీనం, ఇతర అంశాలు GOVT పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘ఆర్థిక పరిస్థితి వల్ల సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుడిగా నా ఆఫీసు డోర్స్ ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. ఏ సమస్య అయినా చెప్పవచ్చు. అన్నిటినీ చర్చిద్దాం. ఆందోళనలు, నిరసనలు లేకుండా RTCని కాపాడుకుందాం’ అని వివరించారు. కార్మిక సంక్షేమం, సంస్థ పురోగతికి కలిసి పనిచేద్దామని అన్నారు.
News February 24, 2026
HYD: షాకింగ్! 13ఏళ్ల బాలికకు గుండెపోటు

వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలిలా.. ఆగపల్లి గ్రామస్థుడు లకుమళ్ల యాదవరావు కూతురు నిహారిక(13) ఛాతిలో నెప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులో హాట్ఎటాక్తో మరణించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.


