News March 26, 2025
లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం: MNCL కలెక్టర్

లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలపవద్దని సూచించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 3, 2025
వార్షిక ఆదాయ లక్ష్యాలను అధిగమించండి: కలెక్టర్

జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను 100% అధిగమించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News December 3, 2025
GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

TG: గ్రేటర్ హైదరాబాద్లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.
News December 3, 2025
అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి ఏద్దేవా చేశారు. బుధవారం హుస్నాబాద్ ప్రజా పాలన సభలో మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతోనే నేటికీ తెలంగాణ ప్రజలకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వైఫల్యమైందని విమర్శించారు.


