News February 13, 2025
లెదర్ పార్క్ పై కొరియన్ బృందంతో జిల్లా కలెక్టర్ భేటీ

నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొరియన్ కంపెనీ బృందం సభ్యులతో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఈడీబి రంజిత్ సమావేశంలో పాల్గొన్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసే లెదర్ పార్క్ స్థల పరిశీలన పై వారు చర్చించారు. పరిశ్రమ ఏర్పాటుతోపాటు పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. లెదర్ పార్క్ ఏర్పాటు ప్రయోజనాలను బృందం సభ్యులకు వివరించారు.
Similar News
News November 22, 2025
మంగేళ గ్రామంలో ఎస్సీలకు దక్కని రాజ్యాంగ ఫలం

ఎస్సీ జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎస్సీ కులస్థులకు మాత్రం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రాజకీయ రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. బీర్పూర్ (M) మంగేళ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 238గా ఉంది. ప్రస్తుతం సుమారు 350 వరకు ఉంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో ఎస్సీ కులస్థులు వెనుకబడి పోతున్నారు. ఇప్పుడైనా ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరుతున్నారు.
News November 22, 2025
అచ్చంపేట: ASI మహేశ్ మృతి

అచ్చంపేట పట్టణంలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్న మహేశ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కింద పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అతడి మృతితో పోలీస్ డిపార్ట్మెంట్లో విషాదఛాయాలు అలుముకున్నాయి. పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News November 22, 2025
APR 1 నుంచి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్: సీఎం

AP: క్యాబినెట్ ఆమోదం తెలిపిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 APR 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం NTR వైద్య సేవ ద్వారా ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత ఖర్చు చేస్తున్నామో విశ్లేషించాలని సూచించారు. కాగా కొత్త పథకంతో 1.63 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం, అందులో 1.43 కోట్ల BPL కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందుతుంది.


