News February 13, 2025

లెదర్ పార్క్ పై కొరియన్ బృందంతో జిల్లా కలెక్టర్ భేటీ

image

నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొరియన్ కంపెనీ బృందం సభ్యులతో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఈడీబి రంజిత్ సమావేశంలో పాల్గొన్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసే లెదర్ పార్క్ స్థల పరిశీలన పై వారు చర్చించారు. పరిశ్రమ ఏర్పాటుతోపాటు పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. లెదర్ పార్క్ ఏర్పాటు ప్రయోజనాలను బృందం సభ్యులకు వివరించారు.

Similar News

News November 26, 2025

తెంబా బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడు

image

SA క్రికెట్‌లో అద్భుతమైన నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ తెంబా బవుమా ఇప్పుడు కొత్త సంచలనాలను నమోదు చేస్తున్నారు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ICC టైటిల్ అందించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజా సిరీస్ విజయంతో 25ఏళ్ల తరువాత భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్‌ అయ్యారు. 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.

News November 26, 2025

ASF: డిజిటల్ వివరాలను టీ పోల్‌లో నమోదు చేయాలి

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు, సూచలను జారీచెశారు. పోలింగ్ క్రేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీ పోల్‌లో నమోదు చేయాలన్నారు.

News November 26, 2025

పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడి మృతి

image

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్, అతని అల్లుడు ప్రవీణ్ బైక్‌పై రంగాపురం నుంచి పెబ్బేరుకు వస్తుండగా బైపాస్ వద్ద హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు రమేష్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.