News March 31, 2025
లేపాక్షి: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేంద్ర వివరాల మేరకు.. వీఆర్ఏ రామాంజనేయులును అతని తమ్ముడు అశ్వర్థ మద్యం తాగి మెట్ల మీద నుంచి తోసేశాడు. దీంతో వీఆర్ఏ ఇంటి పై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయై అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Similar News
News December 10, 2025
జనవరి 25న కోనసీమలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం

కోనసీమ జిల్లా స్థాయి మాదిగ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని జిల్లా ఉపాధ్యక్షులు కె.రాఘవ పిలుపునిచ్చారు. జనవరి 25న జరగనున్న ఈ సభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ కృష్ణ మాదిగ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మాదిగ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని సభను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సమ్మేళనం మాదిగ జాతి ఐక్యత, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
News December 10, 2025
18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకే: గద్వాల కలెక్టర్

గద్వాల జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫోటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డ్ మ తదితర వాటిని చూయించి ఓటు వేయవచ్చని తెలిపారు.
News December 10, 2025
MBNR: అతిథి అధ్యాపక పోస్టుకు నోటిఫికేషన్

మహబూబ్నగర్ ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.కె.పద్మావతి తెలిపారు. సంబంధించిన పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 11 నుంచి 12 వరకు అందజేయాలని తెలిపారు.


