News March 31, 2025

లేపాక్షి: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేంద్ర వివరాల మేరకు.. వీఆర్ఏ రామాంజనేయులును అతని తమ్ముడు అశ్వర్థ మద్యం తాగి మెట్ల మీద నుంచి తోసేశాడు. దీంతో వీఆర్‌ఏ ఇంటి పై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయై అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Similar News

News September 19, 2025

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?

image

రోజులో చాలా ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్. కానీ, చాలామంది దానిని స్కిప్ చేస్తుంటారు. నైట్ ఎక్కువ తిన్నారనో, బరువు తగ్గాలనో కారణం ఏదైనా టిఫిన్ చేయడం మానేస్తారు. దాంతో మెదడుకు కావాల్సిన ఎనర్జీ దొరక్క ఏకాగ్రత లోపిస్తుంది. బ్లోటింగ్, అజీర్తి, గుండె సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. మరోవైపు టిఫిన్ ఆలస్యంగా చేస్తే ఆయుష్షు 8-10 శాతం తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ స్టడీ చెబుతోంది. SHARE IT.

News September 19, 2025

నేడు ఒమన్‌తో భారత్ మ్యాచ్

image

ఆసియా కప్‌లో భారత్ ఆఖరి గ్రూప్ మ్యాచ్‌కి రెడీ అవుతోంది. నేడు దుబాయ్ వేదికగా ఒమన్‌తో SKY సేన తలపడనుంది. ఇప్పటికే PAK, UAEలపై గ్రాండ్ విక్టరీలు సాధించిన IND సూపర్‌-4కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ్టి నామమాత్రపు మ్యాచును సూపర్-4కి ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనుంది. ఈమేరకు జట్టులో పలు మార్పులు చేసే ఛాన్సుంది. బుమ్రా, కుల్దీప్/వరుణ్‌లకు రెస్ట్ ఇచ్చే అవకాశముంది. మ్యాచ్ రా.8గంటలకు ప్రారంభమవుతుంది.

News September 19, 2025

సంగారెడ్డి: ‘31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా’

image

జిల్లాలో ఇప్పటివరకు 31,111 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో 514 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్ల వద్ద అందుబాటులో ఉందని చెప్పారు. 6912 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. చివరి వారం వరకు యూరియా సరఫరా అవుతుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.