News February 18, 2025

లేపాక్షి ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

image

లేపాక్షి వీరభద్రాలయంలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ చేతన్‌ను వీరభద్రాలయ ధర్మకర్తల మండల ఛైర్మన్ కరణం రమానందన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి నరసింహమూర్తి ఆహ్వానించారు. ఈ ఏడాది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా బ్రహ్మ రథోత్సవం, శివపార్వతుల కళ్యాణోత్సవం, జాగారం రోజున విశేష కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

Similar News

News November 10, 2025

భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

image

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.

News November 10, 2025

మీర్జాగూడ ఘటన.. టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

image

చేవెళ్ల పరిధి మీర్జాగూడ గేట్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన టిప్పర్ డ్రైవర్, నాందేడ్ జిల్లా వాసి ఆకాశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈరోజు చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.

News November 10, 2025

మీర్జాగూడ ఘటన.. టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

image

చేవెళ్ల పరిధి మీర్జాగూడ గేట్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన టిప్పర్ డ్రైవర్, నాందేడ్ జిల్లా వాసి ఆకాశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈరోజు చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.