News February 18, 2025
లేపాక్షి ఉత్సవాలకు కలెక్టర్కు ఆహ్వానం

లేపాక్షి వీరభద్రాలయంలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ చేతన్ను వీరభద్రాలయ ధర్మకర్తల మండల ఛైర్మన్ కరణం రమానందన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి నరసింహమూర్తి ఆహ్వానించారు. ఈ ఏడాది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా బ్రహ్మ రథోత్సవం, శివపార్వతుల కళ్యాణోత్సవం, జాగారం రోజున విశేష కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
Similar News
News October 27, 2025
రాజమండ్రి: ఇంటర్ విద్యార్థులకు గమనిక

ఇంటర్ విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించాలసి ఉంటుందని ఆర్ఐవో NSVL నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్, రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులంతా తమ పరీక్ష ఫీజును ఈ గడువులో చెల్లించాలని చెప్పారు. గడువు దాటితే రూ.1000 ఫైన్తో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
News October 27, 2025
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: ఎంపీ

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా గత ఐదు, పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో గన్ కల్చర్ పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దన్నారు.
News October 27, 2025
NZB: ‘లక్కీ’ డ్రా లో 18 మంది మహిళలకు వైన్స్లు

నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం షాపులకు సోమవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సారధ్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో 18 మంది మహిళలకు వైన్స్లు వరించాయి. గెజిట్ సీరియల్ నం.NZB-5, 7, 9, 16, 22, 50, 53, 57, 65, 69, 71, 78, 79, 82, 85, 86, 88, 97 షాపులు డ్రాలో మహిళలకు దక్కాయి. ఇందులో ఒక మహిళకు సాటాపూర్-1, పోతంగల్ షాపులు దక్కడం విశేషం.


