News October 7, 2024

లేపాక్షి: డివైడర్‌ను ఢీకొన్న కారు..ఇద్దరి మృతి

image

లేపాక్షి మండలంలోని చోళ సముద్రం సమీపంలో డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. బ్రహ్మకుమారీ ఆశ్రమంలోని 8 మంది ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మడకశిర వెళ్లి తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు కుంగి ఉండడంతో కారు బోల్తా పడింది. ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎ. సరస్వతమ్మ, నారాయణమ్మలు మృతి చెందారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 7, 2024

కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇలా..!

image

అనంతపురం పట్టణం పరిధిలోని స్థానిక కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. ఆదివారం మొత్తం 18 మండీలకు 675 టన్నులు వచ్చాయి. కిలో గరిష్ఠంగా రూ.52, మధ్యస్థం రూ.40, కనిష్ఠం రూ.30 చొప్పున ధరలు పలికాయి. 15 కిలోల బుట్ట ధర గరిష్ఠం రూ.780, మధ్యస్థం రూ.600, కనిష్ఠం రూ. 450 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ యార్డు ఇన్‌ఛార్జి రాంప్రసాద్ రావ్ ఓ ప్రకటనలో తెలిపారు.

News October 7, 2024

పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ పి.జగదీష్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 15వ తేదీ తర్వాత జిల్లాలో ఉన్న 5 ఇసుక రీచ్‌లు మ్యానువల్ ఆపరేషన్‌లో ఉంటాయన్నారు.

News October 6, 2024

కదిరిలో ఘోరం.. పసి బిడ్డను వదిలి వెళ్లిన కసాయి తల్లి

image

స్థానిక RTC బస్‌స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ అక్కడే ఉన్న మరో మహిళకు తన 5 నెలల చిన్న పాపను తాను బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని ఇచ్చి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను గురించి వాకబు చేశారు. ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పాపను ఈ రోజు ICDS వారికి అప్పగించారు. ఆచూకీ తెలిస్తే సీఐ, కదిరి టౌన్, సెల్ 94407 96851 సమాచారం ఇవ్వాలని కోరారు.