News March 27, 2025
లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News November 28, 2025
జర్నలిస్టులకు అనంతపురం కలెక్టర్ గుడ్ న్యూస్

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. పొడిగించిన గడువు 1.12.2025 నుంచి 31.1.2026 వరకు ఉంటుందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ గమనించగలరు.
News November 28, 2025
గుత్తి రైల్వే ఉద్యోగి భార్య సూసైడ్

గుత్తి ఆర్ఎస్లోని రైల్వే ఇన్స్టిట్యూట్ సమీపంలో ఉన్న క్వార్టర్స్లో నివాసముండే అసిస్టెంట్ లోకో పైలట్ రాహుల్ కుమార్ సతీమణి జ్యోతి (23) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ కుమార్ మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో జ్యోతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 27, 2025
గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.


