News March 10, 2025

లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

image

పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. లైన్‌మెన్ రామారావు మృతి బాధ కలిగించిందన్నారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు.

Similar News

News September 17, 2025

‘అయ్యప్ప’ అంటే అర్థం ఇదే!

image

అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు. అయ్య అంటే విష్ణువును సూచించే అయ్యన్ అని, అప్ప అంటే శివుడిని సూచించే అప్పన్ అని అర్థం వస్తుంది. ఈ రెండు పదాల కలయికతోనే ఆయనకు అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఆయనను ధర్మశాస్తా, మణికంఠుడు అని కూడా పిలుస్తారు. మహిషాసురిడి సోదరి అయిన మహిషిని సంహరించి అయ్యప్ప ధర్మాన్ని నిలబెడతాడు. శబరిమల క్షేత్రంలో కొలువై ఉంటాడు. భక్తులు ఇక్కడికి దీక్షతో వెళ్లి ఆయన ఆశీస్సులు పొందుతారు.

News September 17, 2025

మిల్క్ బ్యాంక్ అంటే ఏమిటి..?(1/2)

image

మిల్క్ బ్యాంక్ తల్లి పాల దాతల నుంచి పాలను సేకరిస్తుంది. ప్రసవానంతరం మహిళలు వారి బిడ్డలకు పాలు ఇవ్వగా, మిగిలిన పాలను మిల్క్ బ్యాంక్‌లో డొనేట్ చేస్తారు. ఫార్ములా పాలతో పోల్చి చూస్తే పాశ్చరైజ్డ్ డోనర్ పాలకు పోషక విలువలు ఎక్కువ. ముందుగా పాలల్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయేమో చెక్ చేసి తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి, నిల్వ చేస్తారు. తల్లిపాలు లభ్యంకాని శిశువులకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది.

News September 17, 2025

తల్లిపాలు దానం చేయడానికి ఎవరు అర్హులంటే..(2/2)

image

తల్లిపాలు దానం చేయాలంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్లూ లేవని రక్తపరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. తన బిడ్డకు పాలు తాగించిన తర్వాత, డొనేట్ చేయగలిగినన్ని పాలు ఉంటే దానం చేయవచ్చు. పొగాకు, డ్రగ్స్, ఆల్కహాల్, ఎక్కువ కెఫీన్ తీసుకొనే అలవాటు ఉన్నవారు, HIV, HTLV, హెపటైటిస్ B, C, సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉన్న తల్లులు బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయకూడదు. అవయవ, కణజాల మార్పిడి చేయించుకున్న వారు దానం చేయడానికి అనర్హులు.