News February 10, 2025

లోకసభ స్పీకర్‌ను అయ్యన్న ఆహ్వానం

image

రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు సోమవారం ఢిల్లీలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్లో రెండు రోజులపాటు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని లోకసభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

Similar News

News November 5, 2025

శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

image

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.

News November 5, 2025

అచ్చంపేట: రేషన్ కార్డు లబ్ధిదారులకు సంచులు పంపిణీ

image

రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రతి నెల బియ్యం కోసం ఇంటి వద్ద నుంచి సంచులు తెచ్చుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నేల నవంబర్ ఫస్ట్ నుంచి లబ్ధిదారులకు ఉచితంగా సీఎం, ఉప ముఖ్యమంత్రి, శాఖ మంత్రి ఫొటోలతో ఉన్న సంచులను పంపిణీ చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 550 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 2 లక్షల 43వేల 720 సంచులను మంజూరు చేశారు. రేషన్ డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.

News November 5, 2025

దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

image

ఎకనామిక్ సర్వే (2024-25) ప్రకారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలసరి GDPలో దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నిలిచింది. దీని తలసరి GDP ₹11.46 లక్షలు. ఆ తర్వాత గురుగ్రామ్ (₹9.05 లక్షలు), బెంగళూరు అర్బన్ (₹8.93L), గౌతమ్ బుద్ధ్ నగర్-నోయిడా, సోలాన్ (HP), నార్త్&సౌత్ గోవా, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై(₹6.57L), అహ్మదాబాద్ ఉన్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలు, మెరుగైన కనెక్టివిటీ వల్ల రంగారెడ్డి టాప్‌లో నిలిచింది.