News June 17, 2024
లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మంత్రి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుతో పలు రాజకీయం అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలని లోకేశ్ సూచించారు. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు.
Similar News
News January 19, 2026
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏయూ విద్యార్థులకు పోటీలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్లో కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు NSS భవనంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఆర్ట్స్ కళాశాల పరిధిలోని చిత్రలేఖన విభాగంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తారు. విజేతలకు 26వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని అధికారులు సూచించారు.
News January 19, 2026
విశాఖ మీదుగా కొత్త ‘అమృత్ భారత్’ రైళ్లు

విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రెండు కొత్త వీక్లీ ‘అమృత్ భారత్’ రైళ్లను రైల్వే శాఖ ఖరారు చేసింది. (20604/20603) నాగర్కోయిల్ – న్యూ జల్పాయిగురి నాగర్కోయిల్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. ట్రైన్ (20610/20609) తిరుచిరాపల్లి -న్యూ జల్పాయిగురి – తిరుచిరాపల్లి జనవరి 28 నుంచి ప్రారంభమవుతోంది. ఈ రైళ్లు దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
News January 19, 2026
జీవీఎంసీలో పీజీఆర్ఎస్కు 57 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 57 వినతులు వచ్చాయి. ఈ వినతులను కమిషనర్ కేతన్ గార్గ్ తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 3, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యం విభాగానికి 4, పట్టణ ప్రణాళిక విభాగానికి 30, ఇంజినీరింగు విభాగానికి 15, మొక్కల విభాగానికి ఒకటి వచ్చిందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


