News March 19, 2025
లోకేశ్వరం: ‘ఫోన్ ఆర్డర్ పెడితే.. రూ.100 స్పీకర్ వచ్చింది’

రూ.వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్ పెడితే రూ.100 విలువచేసే డమ్మీ స్పీకర్ రావడంతో కొనుగోలుదారుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లోకేశ్వరం మండలం పుస్పూర్ తండాకి చెందిన వెంకట్ జీవన్ శ్రీ ఆరోగ్య బెంగళూర్ అనే సంస్థకు చెందిన వెబ్సైట్లో శాంసంగ్ 5G రూ.16 వేల ఫోన్ కేవలం రూ.3,500కు వస్తుందని చూసి పేమెంట్ చేశాడు. ఆర్డర్ వచ్చాక వేచి చూస్తే రూ.100 విలువ చేసే సౌండ్ బాక్స్ వచ్చిందని వాపోయాడు.
Similar News
News November 21, 2025
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: ఎస్పీ

ప్రజలకు పోలీసు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సబ్-డివిజన్ల పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
News November 21, 2025
నీటి నిల్వ, సంరక్షణ చర్యలను మెచ్చిన కేంద్రం

AP: రాష్ట్రవ్యాప్తంగా డి.సీఎం పవన్ నేతృత్వంలో నీటి నిల్వ, సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు జల్ శక్తి అవార్డులు వరించాయి. పంచాయతీ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో మదనపల్లి మండలం, దుబ్బిగానిపల్లె, ద్వితీయ స్థానంలో ప్రకాశం(జి), పీసీ పల్లె(మం) మురుగమ్మి గ్రామం, జల్ సంచయ్-జన్ భాగీదారీలో దక్షిణ జోన్లో నెల్లూరు జిల్లాకు అవార్డు దక్కింది.
News November 21, 2025
‘వస్త్ర పరిశ్రమ సాధికారత.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక’

ఇందిరా మహిళ చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉపయోగపడుతుందని, మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జిల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని, 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యతను చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.


