News March 19, 2025
లోకేశ్వరం: ‘ఫోన్ ఆర్డర్ పెడితే.. రూ.100 స్పీకర్ వచ్చింది’

రూ.వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్ పెడితే రూ.100 విలువచేసే డమ్మీ స్పీకర్ రావడంతో కొనుగోలుదారుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లోకేశ్వరం మండలం పుస్పూర్ తండాకి చెందిన వెంకట్ జీవన్ శ్రీ ఆరోగ్య బెంగళూర్ అనే సంస్థకు చెందిన వెబ్సైట్లో శాంసంగ్ 5G రూ.16 వేల ఫోన్ కేవలం రూ.3,500కు వస్తుందని చూసి పేమెంట్ చేశాడు. ఆర్డర్ వచ్చాక వేచి చూస్తే రూ.100 విలువ చేసే సౌండ్ బాక్స్ వచ్చిందని వాపోయాడు.
Similar News
News October 23, 2025
రాజధానిలో 12 బ్యాంకులకు 28న శంకుస్థాపన

AP: అమరావతిలో 12 ప్రముఖ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాల్గొననున్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. SBI, కెనరా, యూనియన్ బ్యాంక్, BOB, ఇండియన్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, PNB, BOI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కానున్నాయి.
News October 23, 2025
నేడు భగినీ హస్త భోజనం

5 రోజుల దీపావళి పండుగలో చివరిది భగినీ హస్త భోజనం. ‘భగిని’ అంటే సోదరి అని అర్థం. ఆమె చేతి భోజనం సోదరుడికి దైవ ప్రసాదంతో సమానం. పురాణాల ప్రకారం.. ఈ పండుగను యమునా దేవి తన సోదరుడు యముడితో కలిసి నిర్వహించింది. అందుకే నేడు అన్నాచెల్లెల్లు/అక్కాతమ్ముళ్లు కలిసి ఆప్యాయంగా కొద్ది సమయం గడుపుతారు. ఇది అకాల మరణం నుంచి తప్పిస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం వెనుక బంధాలను బలోపేతం చేసే కారణం కూడా ఉంది.
News October 23, 2025
అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే ఫ్యాక్ట్ చెక్

భారత రైల్వేకు సంబంధించి అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్ చెక్ను తీసుకొచ్చింది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు X హ్యాండిల్ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. రైల్వేల గురించి తప్పుదారి పట్టించే లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే <