News March 13, 2025
లోకేశ్వర్ రెడ్డిపై దాడి టీడీపీ నేతల పనే: YCP

కోవెలకుంట్ల మం. కంపమల్లలో YCP <<15743280>>నేత<<>> లోకేశ్వర్ రెడ్డిపై TDP నేతలే హత్యాయత్నం చేశారని YCP ఆరోపించింది. ‘పొలంలో ఉన్న లోకేశ్వర్ రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. అతని ఇంటిపైనా దాడికి పాల్పడటంతో లోకేశ్వర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి గాయాలయ్యాయి. ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యాలు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News December 4, 2025
సీఎం చంద్రబాబుతో అదానీ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ పోర్ట్స్&SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ భేటీ అయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అదానీ గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం ట్వీట్ చేశారు. ఈ మీటింగ్లో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.
News December 4, 2025
బల్దియా.. బడా హోగయా!

ORR సమీపంలోని 20 పట్టణాలు, 7 నగరాలు GHMCలో విలీనమయ్యాయి. DEC 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. దీంతో విస్తీర్ణం, జనసాంద్రత, పరిపాలనా విభాగాల పరంగా GHMC దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు, నగరాల రికార్డులను స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
News December 3, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ: భద్రాద్రి కలెక్టర్
✓టేకులపల్లి: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్
✓పినపాక: ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలి: సీఐ
✓సైబర్ నేరాల నివారణకు 42 రోజులు పాటు అవగాహన
✓చర్ల: మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు: CPIML
✓ జిల్లాలో 6 బయో ఇన్ పుట్ సెంటర్లు: కేంద్ర సహాయ మంత్రి
✓కొత్తగూడెం: రైల్వే ట్రాక్ పై నాటు బాంబు కలకలం


