News May 10, 2024
లోక్సభ ఎన్నికల నిర్వహణపై పటిష్టమైన ఏర్పాట్లు చేశాం: సీపీ

శాంతియుత వాతావరణంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ఎన్ఫోర్స్మెంట్.. తదితర ఎన్నికల విధులపై సిబ్బందికి పోలీస్ కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటంతో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై సూచనలు చేశారు.
Similar News
News February 8, 2026
ఖమ్మం: కర్మకాండలకు వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు

బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన సుతారీ మేస్త్రి అన్నెపర్తి ఎల్లయ్య శనివారం రాత్రి బైక్పై వస్తుండగా.. జిన్నింగ్ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2026
‘మధిర అంటే నాకు ప్రాణం’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘మధిర అంటే నాకు ప్రాణం..నా జన్మధన్యమయ్యేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా మంచి కౌన్సిలర్లను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
News February 8, 2026
ఖమ్మం: ఎన్నికల నోడల్ ఆఫీసర్గా వీవీఎల్ అన్నపూర్ణ

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్గా అసిస్టెంట్ సెక్రటరీ వీవీఎల్ అన్నపూర్ణను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఏదులాపురం (32 వార్డులు), కల్లూరు (20), మధిర (22), సత్తుపల్లి (23), వైరా (20) పరిధిలో ఎన్నికల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఆమె పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు 92475 97048 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.


