News April 11, 2024

లోక్ సభ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి:కలెక్టర్ హరిచందన

image

NLG:లోక సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం,రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు.బుధవారం ఆమె మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాన్ని,ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను, ఈవీఎంల కమీషనింగ్ రూములను పరిశీలించారు.

Similar News

News October 19, 2025

NLG: జిల్లాలో ఇక భూ సర్వేలు చకచకా!

image

ఇక భూ సర్వేలు చకచకా కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 17 మంది ప్రభుత్వ సర్వేయర్లు, ముగ్గురు డిప్యూటీ సర్వేయర్లు, ఆరుగురు కమ్యూనిటీ సర్వేయర్లు మొత్తం 26 మంది మాత్రమే ఉన్నారు. లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో సర్వేయర్ల కొరత తీరనుంది. ఇప్పటికే లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొలి విడత శిక్షణకు ఎంపికైన లిస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది.

News October 19, 2025

నల్గొండ: 23 వరకు గడువు.. 27న డ్రా

image

నల్గొండ జిల్లాలో 154 వైన్స్‌లకు 4,619 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 2, 180 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున రూ. 138.57 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 155 వైన్స్‌లకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 141.14 కోట్ల ఆదాయం లభిచింది. 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది. 27డ్రా తీయనున్నారు.

News October 19, 2025

NLG: ల్యాప్‌టాప్, నగదు మిస్సింగ్.. నిజాయితీ రూపంలో తిరిగొచ్చాయి

image

నల్గొండ నుంచి మిర్యాలగూడకు ప్రయాణిస్తున్న నెమ్మాని సంధ్య ఆటోలో తన ల్యాప్‌టాప్‌తో పాటు రూ.1500 నగదు మరిచిపోయారు. అయితే ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ వాటిని నల్గొండ టూ టౌన్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఎస్సై వై. సైదులు విచారణ జరిపి ల్యాప్‌టాప్, నగదును సదరు మహిళకు అందజేశారు. లతీఫ్ నిజాయితీని ఎస్సై అభినందించారు. ఈ మంచితనం ఆదర్శనీయమని ఎస్సై పేర్కొన్నారు.