News September 2, 2024
ల్యాండ్ పూలింగ్ పథకంలో నిబంధనల మార్పు

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టే ల్యాండ్ పూలింగ్ పథకంలో తాజాగా నిబంధనల్లో మార్పు చేయనున్నారు. రైతులకు ఇచ్చే వాటా మౌలిక వసతుల కల్పనకే పరిమితం కానుంది. గతంలో రైతులకు సంబంధించి ప్లాట్లను కూడా హెచ్ఎండీఏ విక్రయించేది. కాగా ఈ నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ ధరకంటే రైతులు ఎక్కువకే విక్రయించుకునే అవకాశముంది.
Similar News
News October 13, 2025
HYD: మీర్పేట్ మాధవి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు

HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ మాధవి హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈనెల 17 నుంచి రోజువారీ జిల్లా ట్రయల్ కోర్టు విచారణ జరపనుంది. మాధవిని ఆమె భర్త గురుమూర్తి హత్య చేసి, ముక్కలు చేసి, కుక్కర్లో ఉడుకబెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సైంటిఫిక్ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2 నెలల్లో తీర్పు వస్తుందని సీపీ సుధీర్బాబు వెల్లడించారు.
News October 13, 2025
HYD: మహిళలపై అత్యాచారం, కిడ్నాప్.. NCRB REPORT ఇదే..!

మహిళల కిడ్నాప్ ఘటనలకు సంబంధించి రాష్ట్రంలో 2,152 కేసులు నమోదు కాగా అందులో సైబరాబాద్ పరిధిలో ఏకంగా 500 నమోదయ్యాయి. ఇక అత్యాచారం కేసులు అత్యధికంగా HYD కమిషనరేట్ పరిధిలో 173, రాచకొండ పరిధిలో 143, సైబరాబాద్లో 101 ఉన్నాయి. NCRB-2023 తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో ఈ వివరాలను పొందుపరిచారు. మహిళలపై నేరాలకు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా HYD కమిషనరేట్ పరిధిలో 3,822 కేసులు నమోదైనట్లు NCRB తెలిపింది.
News October 13, 2025
HYD: అబ్బాయిలపై లైంగిక దాడి.. నిందితుడి ARREST

HYD సైదాబాద్ <<17990748>>బాలసదన్లో లైంగిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఓ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రెహమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐదుగురు అబ్బాయిలకు పోలీసులు వైద్య పరీక్షలను చేయించనున్నారు. కాగా ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా సీరియస్గా స్పందించింది.