News March 22, 2025
ల్లాపూర్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం అత్యధికంగా కొల్లాపూర్ పట్టణంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొందలపల్లి 35 డిగ్రీలు, తోటపల్లి, వెల్దండ 34 డిగ్రీలు, అమ్రాబాద్ 32 డిగ్రీలు, అత్యల్పంగా తాడూరు మండల కేంద్రంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News November 18, 2025
మందమర్రి: విధుల్లో తల్లికి బదులు కొడుకు

మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ఆరు నెలలుగా తల్లికి బదులు ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. కార్యాలయంలో ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు పనిచేస్తుండగా అందులో ఒకరి స్థానంలో ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడిని ఎంపీడీవో డ్రైవర్గా ఉపయోగించుకుంటున్నాడని పేర్కొన్నారు. దీంతో ఇద్దరు ఆఫీస్ సబార్డినేటర్లపై అధిక భారం పడుతుందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 18, 2025
మందమర్రి: విధుల్లో తల్లికి బదులు కొడుకు

మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ఆరు నెలలుగా తల్లికి బదులు ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. కార్యాలయంలో ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు పనిచేస్తుండగా అందులో ఒకరి స్థానంలో ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడిని ఎంపీడీవో డ్రైవర్గా ఉపయోగించుకుంటున్నాడని పేర్కొన్నారు. దీంతో ఇద్దరు ఆఫీస్ సబార్డినేటర్లపై అధిక భారం పడుతుందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
News November 18, 2025
బోడుప్పల్: తలనొప్పిగా మారుతున్న స్పామ్ కాల్స్..!

స్పామ్ కాల్స్ మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి రవి విసుగెత్తి నెట్ వర్క్ ప్రొవైడ్ అధికారులకు కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తన పనికి పదేపదే ఆటంకం కలుగుతుందని, అంతేకాక, సైబర్ నేరగాళ్లు సైతం పలుమార్లు కాల్ చేసినట్లు ఆయన ఫిర్యాదులు పొందుపరిచారు.


