News March 22, 2025

ల్లాపూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం అత్యధికంగా కొల్లాపూర్ పట్టణంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొందలపల్లి 35 డిగ్రీలు, తోటపల్లి, వెల్దండ 34 డిగ్రీలు, అమ్రాబాద్ 32 డిగ్రీలు, అత్యల్పంగా తాడూరు మండల కేంద్రంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News February 23, 2026

గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

image

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

News February 23, 2026

మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

image

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.

News February 23, 2026

జగిత్యాల జిల్లాలో ముందస్తు చర్యలు: ఎస్.ఈ

image

జగిత్యాల జిల్లా విద్యుత్ వినియోగదారులకు వేసవిలో మెరుగైన, నాణ్యమైన, నిరంతర సరఫరా అందించేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్.ఈ. బి.సుదర్శనం తెలిపారు. 45 ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు,96 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 9 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 2 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టి, అవసరమైన చోట17 కొత్త బ్రేకర్లు అమర్చామన్నారు. ఇంటర్‌లింక్ లైన్ మెరుగుపర్చామన్నారు.