News March 22, 2025

ల్లాపూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం అత్యధికంగా కొల్లాపూర్ పట్టణంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొందలపల్లి 35 డిగ్రీలు, తోటపల్లి, వెల్దండ 34 డిగ్రీలు, అమ్రాబాద్ 32 డిగ్రీలు, అత్యల్పంగా తాడూరు మండల కేంద్రంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News December 2, 2025

క్రైస్తవ సేవా/ ప్రతిభ అవార్డులకు DEC 6 LAST DATE

image

సామాజిక, విద్యా, వైద్య, సాహిత్యం, కళా, క్రీడా వంటి రంగాల్లో విశిష్ట సేవలు లేదా ప్రతిభ కనబరిచిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందించనున్నట్లు PDPL జిల్లా ఇన్‌ఛార్జ్ మైనారిటీల సంక్షేమ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వ్యక్తులు లేదా ఉత్తమ సేవా సంస్థలు DEC 6 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. నామినేషన్ ఫారాలు www.tscmfc.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

News December 2, 2025

హైదరాబాద్‌లో అజయ్​ దేవ్​గన్​ ఫిల్మ్​ సిటీ!

image

TG: రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’ వేదిక కానుంది. HYDలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU కుదుర్చుకోనున్నారు. అలాగే నైట్ సఫారీ ఏర్పాటుకు రిలయన్స్‌కు చెందిన వనతార యానిమల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ ముందుకొచ్చింది. ఫుడ్‌లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మాణానికి ఒప్పందం చేసుకోనుంది.

News December 2, 2025

భారత్‌పై పాక్ మీడియా అసత్య ప్రచారం

image

తుఫానుతో నష్టపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు గగనతల అనుమతులివ్వాలని సోమవారం 1PMకు పాక్ కోరగా 4గంటల్లోనే IND ఒప్పుకుంది. అయితే పర్మిషన్ ఇవ్వలేదని పాక్ మీడియా ప్రచారం చేయడాన్ని భారత్ ఖండించింది. మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని, PAK మీడియా నివేదికలు బాధ్యత రాహిత్యమైనవని పేర్కొంది. గగనతల అనుమతుల విషయంలో సాంకేతిక, భద్రతా అంచనాలనే IND పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో నిరాకరణ ఉండదని చెప్పింది.