News March 22, 2025

ల్లాపూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం అత్యధికంగా కొల్లాపూర్ పట్టణంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొందలపల్లి 35 డిగ్రీలు, తోటపల్లి, వెల్దండ 34 డిగ్రీలు, అమ్రాబాద్ 32 డిగ్రీలు, అత్యల్పంగా తాడూరు మండల కేంద్రంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News November 11, 2025

NGKL: రాజ్ మార్గమే రాజమార్గం- SP

image

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సూచించారు. ఈనెల 15న శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

News November 11, 2025

రక్షణ చట్టం వచ్చేవరకు మా అడుగులు ఆగవు- న్యాయవాదుల

image

న్యాయవాదుల భద్రత దేశ న్యాయవ్యవస్థ గౌరవానికి మూలం. రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా అడుగులు ఆగవు అని న్యాయవాద సంఘ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్’ పాదయాత్ర మూడో రోజు బీచుపల్లి శ్రీరామాలయం ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమైంది. ‘న్యాయవాది రక్షణ చట్టం – ఇప్పుడే అమలు చేయాలి’ అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.