News June 12, 2024
వంగలపూడి అనితకు మంత్రి పదవి

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఒకరికే అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను మంత్రి పదవి వరించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కీలకపాత్ర వహించిన అనితకు మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ జాబితాలో గంటా, అయ్యన్న వంటి సీనియర్లకు చోటు లభించకపోవడం గమనార్హం.
Similar News
News March 27, 2025
విశాఖలో డ్రగ్స్ కలకలం

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ డార్మెటరీలో 6.5 గ్రాముల ఎం.డి.ఎం.ఏతో కర్ణాటకకి చెందిన రంగస్వామి నంజి గౌడ (23)గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. అయితే నంజి గౌడ చాలాసార్లు సిటీకి వచ్చినట్లు సమాచారం. అతను ఎవరికి డ్రగ్స్ అమ్ముతున్నాడో తెలియాల్సి ఉంది.
News March 27, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అన్నవరం నుంచి విశాఖ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. తుని ఎస్ఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన పద్మ (48) అన్నవరంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లింది. బుధవారం అక్కడి నుంచి తన కుమారుడి బైక్పై విశాఖ వస్తుండగా తుని RTC కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్పై కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కింద పడిపోయారు. ఆమె పైనుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
News March 27, 2025
వాగన్ పోహ్ వర్క్షాప్ తనిఖీ చేసిన DRM

వడ్లపూడిలో ఉన్న వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ను DRM లలిత్ బోహ్రా బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్క్షాప్లోని వివిధ పీవోహెచ్ సౌకర్యాలు, యంత్రాలు, కార్యాలయాన్ని పరిశీలించారు. రైల్వే వ్యాగన్ల లభ్యతను పెంచడానికి లక్ష్య ఉత్పత్తిని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా జగ్గయ్యపాలెంలో కంటైనర్ కార్పొరేషన్లో సౌకర్యాలను పరిశీలించారు.