News September 15, 2024

వందే భారత్ ట్రైన్‌కు పార్వతీపురంలో హాల్ట్

image

నేటినుంచి ప్రారంభమయ్యే దుర్గ్-విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ రైలుకు పార్వతీపురంలో హాల్ట్ కల్పించారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో విజయనగరం ఒకటే హాల్ట్ ఇచ్చారు. దీంతో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విశాఖపట్నం డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, కేంద్ర రైల్వే సహాయ మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీంతో జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో కూడా హాల్ట్ కల్పించారు.

Similar News

News October 14, 2025

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

News October 13, 2025

VZM: ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న కౌన్సిలింగ్

image

ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలలో 91 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 16న ఉ.11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ దేవి మాధవి సోమవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ జాబితాలు http://vizianagaram.nic.in, అందుబాటులో ఉన్నాయన్నారు.

News October 13, 2025

విజయనగరం పోలీసు వెల్ఫేర్ స్కూల్‌లో టీచర్ ఉద్యోగాలు: SP

image

పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ను బోధించేందుకు డీఈడీ/బీఈడీ అర్హత గల వారు కావాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 16న ఉ.10 గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న పోలీసు వెల్ఫేర్ పాఠశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.