News August 8, 2024
వందే భారత్ నడిచే రోజుల్లో స్వల్ప మార్పులు

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ నడిచే రోజుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు రైల్వే బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రస్తుతం ఆదివారం మినహా ప్రతిరోజు వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తున్నట్లు తెలిపారు. త్వరలో మంగళవారం మినహా ప్రతిరోజు నడిచేలా మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మార్పులు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయో త్వరలో ప్రకటించనున్నారు.
Similar News
News November 9, 2025
విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అలాగే జీవీఎంసీలో కూడా రేపు పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 9, 2025
విశాఖ కలెక్టరేట్లో రేపు జరగబోయే PGRS రద్దు

విశాఖ కలెక్టరేట్లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
News November 9, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.


