News July 16, 2024
వంద రోజుల్లో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటా: ఎస్పీ

100 రోజుల కార్యచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటానని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అంతకుముందు ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.
Similar News
News November 30, 2025
20 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు: మంత్రి భరత్

కర్నూల్ కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు (18-35 ఏళ్లు) జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 20 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను శనివారం విడుదల చేశారు.
News November 30, 2025
రూ.105.66 కోట్లతో రోడ్ల నిర్మాణం: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో పాడైన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ.105.66 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మొత్తం 222.18 కి.మీ పొడవుతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢనాపురం-హొళగుంద రోడ్కు రూ.13.70 కోట్లు, బైచిగేరి-పెద్దకడుబూరు రోడ్కు రూ.6.40 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్కు రూ.7.40 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
News November 30, 2025
రూ.105.66 కోట్లతో రోడ్ల నిర్మాణం: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో పాడైన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ.105.66 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మొత్తం 222.18 కి.మీ పొడవుతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢనాపురం-హొళగుంద రోడ్కు రూ.13.70 కోట్లు, బైచిగేరి-పెద్దకడుబూరు రోడ్కు రూ.6.40 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్కు రూ.7.40 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.


