News April 7, 2024
వంశధార నదిలో అడుగంటిపోతున్న జలాలు

వేసవి కాలం ఆరంభం కావడంతో వంశధార నీటి జలాలు అడుగంటి పోతున్నాయి. దీనికితోడు కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో నదులు జల కళను కోల్పోతున్నాయి. తీర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వంశధార ప్రాజెక్టుకు సైతం నీటి జాడలు తగ్గిపోతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న దాంట్లో 150 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా అధికారులు విడిచిపెడుతున్నారు.
Similar News
News April 5, 2025
శ్రీకాకుళం జిల్లాకు పిడుగుల ముప్పు

ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేనప్పటికీ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
News April 5, 2025
వజ్రపుకొత్తూరు: బాతుపురంలో నెమళ్ల సందడి

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శుక్రవారం నెమళ్లు సందడి చేశాయి. గ్రామం సమీపంలోని కొండల ప్రాంతం నుంచి నెమళ్లు గ్రామానికి చేరుకుని గ్రామంలోని చెట్లపై కనిపిస్తూ కనువిందు చేశాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన నెమళ్లు జనావాసాల్లోకి వస్తుండటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా నెమళ్లు రాక గ్రామస్థులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.
News April 5, 2025
SKLM: అలెర్ట్.. రైళ్ల గమ్య స్థానాల్లో మార్పులు

పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే షాలిమార్- వాస్కోడగామా(VSG) అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్ల గమ్యస్థానంల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున ఈనెల 17- 28 వరకు నం.18047 SHM- VSG రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ వరకు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి మే 1 వరకు నెం.18048 VSG- SHM రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ నుంచి నడుస్తాయన్నారు.