News April 24, 2024

వక్కలగడ్డ బాలికకు 597 మార్కులు

image

టెన్త్ ఫలితాల్లో చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని స్టేట్ మూడవ ర్యాంక్ సాధించింది. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన కనుపర్తి భావజ్ఞ సాయి 600కు 597 మార్కులు తెచ్చుకొని స్టేట్ మూడో ర్యాంక్ సాధించింది. నల్లబోతుల దివ్యశ్రీ 583 మార్కులు, మహమ్మద్ సబిహా బేగం 582 మార్కులు సాధించారు. 

Similar News

News January 18, 2025

కృష్ణా, NTR జిల్లాలపై చంద్రబాబు సంతృప్తి

image

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జుల మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురి మంత్రులను హెచ్చరించారు.

News January 18, 2025

కృష్ణా: ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు

image

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- చర్లపల్లి(CHZ) మధ్య శనివారం ప్రత్యేక రైలును అధికారులు నడుపుతున్నారు. ఈ మేరకు రైలు నం.08549 VSKP- CHZ రైలును శనివారం నడుపుతామన్నారు. ఈ రైళ్లలో 4 జనరల్ కోచ్‌లు, 9 స్లీపర్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. ఈ రైలు మధ్యాహ్నం 2.55 కి విజయవాడ, రాత్రి 9 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని వివరించారు.

News January 18, 2025

కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు- 2024లో నిర్వహించిన ఫార్మ్-డీ కోర్సు 1, 4వ ఏడాది రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.