News August 26, 2024
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం: డీకే అరుణ

సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషిస్తే రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని MBNR ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఇవాళ నిర్వహించిన కార్యశాల సమావేశంలో అరుణ పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు అంకితభావంతో నిర్వహించాలని ఎక్కువ మంది యువకులకు పార్టీ సభ్యత్వం ఇప్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News February 26, 2026
MBNR: ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం

2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఖుష్బూ గుప్త ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు. తొలుత బీహార్ కేడర్కు ఎంపికైన ఆమె, వివాహానంతరం తెలంగాణ కేడర్కు మారారు. ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఆమె 2018 యూపీఎస్సీ పరీక్షలో AIR 80 సాధించారు. పంజాబ్లోని భదౌర్ ఆమె స్వస్థలం. ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో గిరిజన బాలికల విద్యపై విశేష సేవలు అందించారు.
News February 26, 2026
మహబూబ్నగర్ కలెక్టర్గా ఖుష్బూ గుప్త

మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా ఖుష్బూ గుప్తను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్గా సేవలందించిన విజయేందిర బదిలీ కావడంతో, ప్రభుత్వం ఖుష్బూ గుప్తకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన ఆమె, జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
News February 25, 2026
జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


