News February 3, 2025

వచ్చే నెల మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోజు 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News November 19, 2025

రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

News November 19, 2025

హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

image

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.

News November 19, 2025

బెల్లంపల్లి: ఈపీ ఆపరేటర్ల పదోన్నతుల కోసం పరీక్షలు

image

బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ వద్ద బెల్లంపల్లి రీజియన్ (శ్రీరాంపూర్,బెల్లంపల్లి, మందమర్రి) పరిధిలో ఈపీ ఆపరేటర్ పదోన్నతుల కోసం బుధవారం అధికారులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. D గ్రేడ్ నుంచి Cగ్రేడ్ పదోన్నతి కోసం 9మంది, Cగ్రేడ్ నుంచి Bగ్రేడ్ పదోన్నతి కోసం 38 మంది ఈపీ ఆపరేటర్లు పరీక్షలు హాజరయ్యారు. అధికారులు రాజమల్లు, అనిల్ కుమార్, వీరన్న, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.