News February 3, 2025

వచ్చే నెల మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోజు 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్‌లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News October 14, 2025

మంథని: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

image

మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి స్టేజీ సమీపంలో బొక్కల వాగు కట్ట కింద SSB ఇటుకల బట్టి సంపులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిది మంథని మండలం స్వర్ణపెళ్లి గ్రామం. అతడిని ఉప్పు మహేష్‌గా గుర్తించారు. మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. మృతుడు గత ఐదు సంవత్సరాలుగా ట్రాక్టర్ మెకానిక్‌గా మంథనిలో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

News October 14, 2025

RGM: 74 షాపులకు 74 మంది దరఖాస్తులు

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 24 WINES షాపులకు గాను ఇప్పటివరకు 9 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు గతంలో కంటే రూ.లక్ష ఎక్కువ ఉండడంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా జిల్లాలోని 74 మద్యం షాపులకు గాను 74 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 18న దరఖాస్తు గడువు ముగియనుంది. అప్పటివరకు దరఖాస్తులు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు.

News October 14, 2025

పుట్టినప్పుడు 306.. పెరిగాక 206 ఎముకలు!

image

శిశువులు సుమారు 306 ఎముకలతో <<18001798>>పుడితే<<>> యుక్తవయస్సు వచ్చేసరికి అవి 206కి తగ్గుతాయి. మిగిలిన 100 ఎముకలు ఏమయ్యాయనే సందేహం మీకు వచ్చిందా? శిశువులకు మెదడు పెరుగుదల కోసం, ప్రసవ సమయంలో సులభంగా బయటకు వచ్చేందుకు వీలుగా పుర్రెలోని ఎముకలు విడివిడిగా ఉంటాయి. పిల్లలు పెరిగేకొద్దీ ఈ చిన్న ఎముకలు, మృదులాస్థి భాగాలు గట్టిపడి ఒకే పెద్ద ఎముకగా ఏర్పడతాయి. పుర్రె ఎముకలు, వెన్నెముక & కటి ఎముకలు కలిసిపోతాయి.