News August 25, 2024
వచ్చే నెల మొదటి వారంలో సాగర్ నీళ్లు విడుదల: కలెక్టర్

జిల్లాలో సాగుకు సాగర్ నీటిని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఆయకట్టు ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కేటాయింపుల ఆధారంగా నీటి పంపిణీ జరుగుతుందన్నారు. సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆమె కోరారు.
Similar News
News December 21, 2025
ఒంగోలు: సామాన్యుడి ఒక్క ట్వీట్.. ఎంత పని చేసిందంటే?

ఒక సామాన్య వ్యక్తి చేసిన ఒక్క ట్వీట్, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద గల పట్టాలపై ప్రయాణికులు దాటే పరిస్థితిని ఒకరు గమనించారు. రైలు వచ్చే క్రమంలో కూడా ప్రయాణికులు పట్టాలు దాటితే.. ఎంత ప్రమాదమో. ఒక ప్రయాణికుడు ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేకు ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక అంతే ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు తనిఖీ చేసి నిన్న 10 మందిపై కేసులు నమోదు చేశారు.
News December 21, 2025
ఒంగోలు: ఈతకు వెళ్లి బీటెక్ విద్యార్థి మృతి.. పూర్తి వివరాలివే!

ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి హర్ష (18) ఈతకు వెళ్లి మడనూరు వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. 9 మంది స్నేహితులతో కలిసి వెళ్లిన హర్ష మడనూరు తీరం వద్దకు చేరుకోగానే మొదటగా ఇద్దరితో కలిసి తీరంలోకి వెళ్లాడు. ఒకరు అలల ధాటికీ తట్టుకోలేక బయటకు రాగా.. హర్ష, రాధాకృష్ణమూర్తి ఊపిరి ఆడని పరిస్థితికి చేరుకున్నారు. అయితే హర్ష మృతి చెందగా.. రాధాకృష్ణను వైద్యశాలకు తరలించారు.
News December 21, 2025
ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.!

ప్రకాశం టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2015లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించి, 2019లో టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకొని, జిల్లా అధ్యక్షుడి పదవిని దక్కించుకన్నారు.


