News January 22, 2025

వచ్చే నెల 19 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

image

శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.

Similar News

News April 16, 2026

ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించండి: కలెక్టర్

image

నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ నెల 17న ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ నియోజకవర్గ స్పెషల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 2,000 మంది మహిళలతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News April 16, 2026

చిలకలడోణ ప్రమాదంపై ఎంపీ దిగ్భ్రాంతి

image

మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది కర్ణాటక వాసులు మృతి చెందడం బాధాకరమని అన్నారు.

News April 16, 2026

కర్నూలు: అనారోగ్యం బారిన పడినా.. ఇంటర్‌లో అద్భు ప్రతిభ

image

కర్నూలు(D) పెద్దకడుబూరుకు చెందిన బొగ్గుల హరిత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వ్యవసాయ కూలీలు బొగ్గుల పరమేశ్, జ్యోతి దంపతుల కుమార్తె హరిత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడినా ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరై 1000 మార్కులకు 956 మార్కులు సాధించింది. ఆమె విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హరిత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.