News March 6, 2025

వజ్రపుకొత్తూరు: రిటైర్ట్ తెలుగు టీచర్ మృతి

image

వజ్రపుకొత్తూరు పూండి గోవిందపురానికి చెందిన రిటైర్డ్ తెలుగు టీచర్, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తెలికిచెర్ల ప్రసాదరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పూండి పరిసర ప్రాంతాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. 

Similar News

News November 21, 2025

SKLM: ‘జాబ్ కార్డులు కోసం దరఖాస్తుల స్వీకరణ’

image

జాబ్ కార్డుల కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయితీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పంచాయతీలలో గల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కేవైసీ కారణంగా ఆలస్యమైన జాబ్ కార్డులు పరిశీలించి ఇస్తామన్నారు.

News November 21, 2025

సంతబొమ్మాళిలో మహిళ దారుణ హత్య!

image

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆచూకీ లభ్యమయిందని, మర్డర్‌కు గురైనట్లు ఎస్సై నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. నందిగామ మండలం కొండబీంపురం గ్రామానికి చెందిన దాసరి పుష్పలత (34) గా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి వరకు పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను పోస్ట్ చేశారు. ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉందన్నారు.

News November 20, 2025

నౌపడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

image

సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పొలంలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.