News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News March 28, 2025
విశాఖలో ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు: జేసీ

ఉగాది వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉగాది వేడుకల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 30న ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా నిర్వహించాలన్నారు. వేడుకలు అన్ని శాఖల సమన్వయంతో జరగాలన్నారు.
News March 28, 2025
31న జరగాల్సిన టెన్త్ సోషల్ ఎగ్జామ్ వాయిదా

ఈ నెల 31న జరగాల్సిన సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు డీఈవో మాణిక్యం నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31న రంజాన్ కారణంగా పరీక్ష వాయిదా వేసినట్లు చెప్పారు. 31న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ ఒకటిన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని కోరారు.
News March 28, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు
☞ మోత్కూరులో భర్త చేతిలో భార్య దారుణ హత్య
☞ చికెన్ ధరలు తగ్గుతుంటే అవినీతి ఎక్కడ?: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
☞ బీడు భూముల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి: కలెక్టర్
☞ ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు?: శ్వేతా రెడ్డి
☞ శ్రీశైలంలో రెండో రోజు ఘనంగా ఉగాది ఉత్సవాలు
☞ బనగానపల్లెలో ముస్లింల భారీ ర్యాలీ
☞ రుద్రవరంలో అత్యధిక ఉష్ణోగ్రత