News March 20, 2025
వట్టిచెరుకూరు: అత్యాచార ఘటనలో వృద్దుడి మృతి

ఏడేళ్ల బాలికపై అత్యాచార ఘటనలో బాలిక బంధువుల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వృద్దుడు మృతి చెందాడు. వట్టిచెరుకూరు సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిచెరుకూరు మండలంలో 2వ తరగతి చదువుతున్న బాలికపై థామస్ (60)అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలిక బంధువులు థామస్పై దాడి చేయడంతో చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 27, 2026
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత

TG: ప్రముఖ క్షేత్రం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్రాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరులో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. సౌందర్రాజన్ మృతితో ఇవాళ, రేపు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
News February 27, 2026
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.1,905 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.10వేలు, పచ్చి పల్లికాయకు రూ.5,400 ధర వచ్చింది. పసుపు క్వింటాకి కొత్తది రూ.11,151 ధర వస్తే.. నం.5 రకం మిర్చి రూ.20,200, దీపిక మిర్చి రూ.20వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.
News February 27, 2026
NLG: ఇంటికే రానున్న భద్రాద్రి తలంబ్రాలు!

భద్రాచలంలో ఏప్రిల్ 27న జరగనున్న సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా అందించేందుకు టీజీ ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నల్గొండ రీజియన్ ఆర్ఎం కె. జానీ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్లో ఇందుకు సంబంధించిన గోడపత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. భక్తులు రూ. 151 చెల్లించి తలంబ్రాల ప్యాకెట్ను బుక్ చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 31వ తేదీ వరకు ఈ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.


